
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్రాంగోపాల్పేట జేమ్స్స్ట్రీట్లోని చారిత్రక బిల్డింగ్కు రిపేర్లు పూర్తవడంతో మంగళవారం తిరిగి హైదరాబాద్ సిటీ పోలీసులకు అప్పగించారు. సిటీ సీపీ సీవీ ఆనంద్మంగళవారం పురాతన భవనాన్ని సందర్శించారు. ఈ భవనాన్ని 1900లో నిర్మించారని, 2016 వరకు అంటే 116 సంవత్సరాలు రామ్గోపాల్ పేట పోలీస్ స్టేషన్ఇందులోనే కొనసాగిందన్నారు.
9 ఏండ్ల కింద మినిస్టర్ రోడ్డులోని మరో భవనంలోకి షిప్ట్ చేశామన్నారు. రిపేర్లు పూర్తికావడంతో హెచ్ఎండీఏ తిరిగి సిటీ పోలీసులకు అప్పగించిందన్నారు. త్వరలో తమ వస్తువులన్నీ భవనంలోకి తరలించి, జిల్లా ఇన్చార్జ్మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రారంభిస్తామన్నారు. పురాణి హవేలీ కమిషనర్ఆఫీసుకు మూడేండ్లుగా రిపేర్లు జరుగుతున్నాయని, త్వరలో దాన్ని కూడా పున:ప్రారంభిస్తామన్నారు. ప్రతి శుక్రవారం అక్కడి నుంచే తాను విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. నార్త్ జోన్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాల్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.