రంజీ ట్రోఫీ ప్లేట్‌‌‌‌ డివిజన్ ఫైనల్లో నితేశ్‌‌‌‌, ప్రజ్ఞయ్‌‌‌‌ సెంచరీలు

రంజీ ట్రోఫీ ప్లేట్‌‌‌‌ డివిజన్ ఫైనల్లో నితేశ్‌‌‌‌, ప్రజ్ఞయ్‌‌‌‌ సెంచరీలు

హైదరాబాద్‌‌‌‌: మేఘాలయతో రంజీ ట్రోఫీ ప్లేట్‌‌‌‌ డివిజన్ ఫైనల్లో హైదరాబాద్‌‌‌‌కు స్వల్ప తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం లభించింది. నితేశ్‌‌‌‌ రెడ్డి (122), ప్రజ్ఞయ్‌‌‌‌ రెడ్డి (102 నాటౌట్‌‌‌‌) సెంచరీలతో చెలరేగడంతో.. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 25/2 తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన  హైదరాబాద్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 87.5 ఓవర్లలో 350 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ (44) ఫర్వాలేదనిపించాడు. 

ఓదశలో165/6తో కష్టాల్లో పడిన హైదరాబాద్‌‌‌‌ను నితేశ్‌‌‌‌, ప్రజ్ఞయ్‌‌‌‌ గట్టెక్కించారు. ఏడో వికెట్‌‌‌‌కు 131 రన్స్‌‌‌‌ జోడించారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన మేఘాయల ఆట ముగిసే టైమ్‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 0.3 ఓవర్లలో 0/1తో నిలిచింది. ఓపెనర్ రామ్‌‌‌‌ గౌరంగ్‌‌‌‌ (0) డకౌటయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌ 46 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో ఉంది.