
సికింద్రాబాద్,వెలుగు: ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సిటీకి చెందిన విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. మల్కాజిగిరి పరిధి మారుతినగర్కు చెందిన బాల అశోక్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు రేవంత్(29) రెండు నెలల కిందట ఎమ్మెస్ చదివేందుకు చికాగో వెళ్లాడు. ఫ్రెండ్స్తో కలిసి ఉంటుండగా.. గురువారం అతనికి గుండెపోటు వచ్చి మరణించినట్లు తెలిసింది. రేవంత్ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి, లేదంటే శనివారం రేవంత్ డెడ్ బాడీ ఇంటికి రానున్నట్టు తెలిసింది.