చోరీలకు పాల్పడుతున్న9 మంది డెకాయిట్ గ్యాంగ్ సభ్యులను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 11 కేజీ ల వెండిరి స్వాధీనం చేసుకున్నారు.
అజర్ అనే వ్యక్తి దగ్గర నుండి ఈ ముఠా వెండి ఆభరణాలను దోపిడీ చేయడంతో.. బాధితుడు శాలిబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.ఈ కేసులో కీలక నిందితులు మొహమ్మద్ నిజాముద్దీన్, ఆసీఫ్, ఖాలీద్, జావిద్ లు పోలీసులకు పట్టుబడ్డారు.గతంలో కూడా నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.
