హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్కు చెందిన ఎయిర్లైన్ కంపెనీ ట్రూజెట్ తన సర్వీస్లను ఆపేసింది. కంపెనీ సీఈఓ, సీఎఫ్ఓ, సీసీఓలు కూడా రాజీనామా చేశారు. ట్రూజెట్ ఏడు విమానాలను ఆపరేట్ చేస్తోంది. ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చినా ఈ రీజినల్ ఎయిర్లైన్ కంపెనీ పరిస్థితి, కరోనాతో మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. డిమాండ్ తగ్గింది. అద్దెలు రాకపోవడంతో ఏడింటిలో ఐదు విమానాలను వీటిని అద్దెకు ఇచ్చిన వారు వాపసు తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి ట్రూజెట్ టాప్ మేనేజ్మెంట్ కంపెనీని విడిచిపెడుతుండగా, గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు శాలరీలను ఇవ్వడంలో ట్రూజెట్ ఇబ్బంది పడుతోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ట్రూజెట్ 2015, జులైలో తన సర్వీస్లను స్టార్ట్ చేసింది. ట్రూజెట్లో మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 90 శాతం వాటా ఉంది. రామ్చరణ్కు ఈ కంపెనీలో వాటాలుండగా, ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉడాన్ స్కీమ్తో కంపెనీ పుంజుకుంటుందన్న టైమ్లో కరోనా వచ్చి పడింది. ఎయిర్లైన్ ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేకపోవడంతో కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. తన సర్వీస్లను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే ఎయిర్ కోస్టా, ఎయిర్ పెగాసెస్, పారమౌంట్, ఎయిర్ కార్నివాల్ వంటి రీజినల్ ఎయిర్లైన్ కంపెనీలు వచ్చినప్పటికీ నిలబడలేదు. తాజాగా ట్రూజెట్ కూడా అదే బాట పట్టింది. ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ లక్ష్మీ ప్రసాద్ ట్రూజెట్లో ఇన్వెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
కరోనాతో అధ్వాన్నంగా మారిన ట్రూజెట్
- బిజినెస్
- February 17, 2022
లేటెస్ట్
- ఆఫ్ఘనిస్థాన్లో భారీ వరదలు.. 68 మంది మృతి
- NBK109 Release date: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్?
- RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్కు రింకూ ఫిదా
- Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర
- ఆఫీసర్ రోల్స్ ఎంజాయ్ చేస్తా..జేసన్ షా ఇంట్రెస్టింగ్ జర్నీ
- ఢిల్లీలో ఆప్ జైల్ భరో మార్చ్.. BJP ఆఫీస్ ముందు నిరసన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- మూలికలతో మొదలైన హిమాలయ.. ఇప్పుడు ఇండియాలోనే పెద్ద మార్కెట్
- OTT Movies: ఓటీటీకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీస్.. అస్సలు మిస్ అవకండి!
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం