ఆత్మహత్యలతో నాకు సంబంధం లేదు: సుప్రీం ను ఆశ్రయించిన అర్నబ్

ఆత్మహత్యలతో నాకు సంబంధం లేదు: సుప్రీం ను ఆశ్రయించిన అర్నబ్

మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు కావాలనే తన మీద కక్షకట్టి కేసులో ఇరికించారని ఆరోపించారు రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామి. ముంబైలోని ఆలీబాగ్ లో నివాసం ఉంటున్న అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యల కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేపు(బుధవారం) సుప్రీం కోర్టులో అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు. అర్నబ్ గోస్వామితో పాటు అరెస్టు అయిన మరో ఇద్దరు కూడా బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.