సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఈ ఏడాది తను నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జూన్ నెలలో ‘సామ్రాట్ పృథ్విరాజ్’ లాంటి హిస్టారికల్ మూవీతో వచ్చిన అక్షయ్.. త్వరలో ఛత్రపతి శివాజీగా కనిపించడానికి రెడీ అయ్యాడు. ఆయన హీరోగా ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ అనే చిత్రం రూపొందబోతోంది. అదుర్స్, సాహో లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన మహేష్ మంజ్రేకర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఖురేషి ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ను ముంబైలో ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసిన అక్షయ్.. శివాజీ పాత్రను పోషించడం తన అదృష్టమని.. ఆయన జీవితం నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పాడు. మరాఠి భాషలో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఛత్రపతి శివాజీ లైఫ్ స్టోరీ కావడం, అక్షయ్ నటిస్తున్నాడు కనుక ప్యాన్ ఇండియా వైడ్గా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.