విద్యార్థులకు రక్షణ విషయంలో వీ.సీతో సాయంత్రం మాట్లాడతా : డీసీపీ

 విద్యార్థులకు రక్షణ విషయంలో వీ.సీతో సాయంత్రం మాట్లాడతా :  డీసీపీ

 పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళనను విరమించారని నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.  అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి వచ్చారని అన్నారు. వసతి గృహంలోని బాత్రూంల వద్ద అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. కళాశాల వసతి గృహంలో భద్రత సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకుని చితకబాదారని తెలిపారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేకంగా గస్తి ఏర్పాటు చేస్తామని అన్నారు.

విద్యార్థులకు రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్, వీ.సీతో సాయంత్రం మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. నిందితుడు గోడ దూకి లోపలికి ప్రవేశించాడని ప్రథమికంగా తెలిసిందని అన్నారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించిన అనంతరం నిందితుడి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.