పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. పంజాబ్లో ఆప్ అధికారంలోకి వస్తే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భద్రత విషయంపై కేంద్రంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. పంజాబ్ లో నిజాయితీగల ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. పంజాబ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ భద్రత విషయంలో బీజేపీ,కాంగ్రెస్ నీచ రాజకీయాలకు దిగాయని ఆరోపించారు. ఆప్ అధికారంలోకి వస్తే పంజాబ్ లో ప్రజల భద్రతకు తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. జాతీయ, అంతర్గత భద్రతపై తాను ఎలాంటి రాజకీయాలు చేయనన్నారు కేజ్రీవాల్.

మరిన్ని వార్తల కోసం

 

థియేటర్స్ లో కొవిడ్ రూల్స్ పాటించాల్సిందే

కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు