కరోనా శవంపై నగలు చూసి.. సోదా చేసి మొత్తం దోచుకున్నారు

కరోనా శవంపై నగలు చూసి.. సోదా చేసి మొత్తం దోచుకున్నారు

తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఘటన

తిరుపతి: కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయిన రోగి శవాన్ని దోచుకున్నారు. మృతదేహంపై చైన్.. ఉంగరాలు ఉండడం గుర్తించిన దుండగులు.. శవాన్ని మొత్తం సోదా చేశారు. చైన్.. ఉంగరాలతోపాటు.. అవసరాల కోసం జేబులో పెట్టుకున్న నగదు కూడా కొట్టేశారు. తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో జరిగిన ఘటన సంచలనం రేపింది.

     తిరుపతి పట్టణంలోని నెహ్రు నగర్ లో నివాసం ఉంటున్న వీర లక్ష్మణ్ సింగ్ అనారోగ్యానికి గురికావడంతో తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు సోమవారం సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ మృతి చెందాడు. వీర లక్ష్మణ్ సింగ్ మృతదేహంపై నగలు ఉండడం గుర్తించిన దుండగులు శవాన్ని సోదా చేశారు. జేబులో పెట్టుకున్న డబ్బు కూడా కొట్టేశారు. ఇదంతా సిమ్స్ సిబ్బందే చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. కరోనా శవం అని చూడకుండా చోరీ చేసిన ఘటనపై లక్ష్మణ్ చిన్నాన్న గిరిధర్ సింగ్ సిమ్స్ పి ఆర్ వో కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి దుండగులెవరో గుర్తించాలని కోరారు. తమకు జరిగిన అన్యాయం వేరే ఎవరికీ జరగకుండా చూడండి అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.