కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నం

కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నం

సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్  నిజమైతే సాక్ష్యాలు ఇవ్వాలని.. సీరియస్ గా దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేసీఆర్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. తెలంగాణ, ఏపీలో గోదావరి వరదలు, లడఖ్, ఉత్తరాఖండ్ లో వరదలకు సంబంధించి  విదేశీ కుట్రలపై కేసీఆర్ సాక్ష్యాలిస్తే సీరియస్ గా విచారణ చేస్తామని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ ఏమన్నారు ? 

 భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వర్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందని.. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా కుట్ర చేసినట్లు కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు.