
నాళాలపై అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. నాళాలను ఆక్రమించి భవనాలు నిర్మించారని .. హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలించి కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే హైడ్రాకు వచ్చిన కంప్లయింట్స్ ఆధారంగా అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చుతున్నారు. ఈ రోజు బేగంపేట.. ప్యాట్నీ ఏరియాల్లోని నాళాలపై నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.
కంటోన్మెంట్ ఏరియాలో తొలిసారిగా అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గురువారం ( జూన్5) కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ తో కలిసి నాళా ఉన్న ఏరియాలను పరిశీలించారు. హైడ్రా కమిషనర్రంగనాథ్. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలతో నాళా కుచించుకుపోయినట్టు గుర్తించారు. కొద్దపాటి వర్షానికే ఈ ప్రాంత ప్రజలు ముంపునకు గురవుతున్నారు. కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్ని నాళా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.