హైడ్రా దూకుడు.. బేగంపేట, ప్యాట్నీ నాళాలపై అక్రమ కట్టడాలు కూల్చివేత

 హైడ్రా దూకుడు.. బేగంపేట, ప్యాట్నీ నాళాలపై అక్రమ కట్టడాలు కూల్చివేత

నాళాలపై అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. నాళాలను ఆక్రమించి భవనాలు నిర్మించారని .. హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో  వాటిని పరిశీలించి కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే హైడ్రాకు వచ్చిన కంప్లయింట్స్​ ఆధారంగా  అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చుతున్నారు.  ఈ రోజు  బేగంపేట.. ప్యాట్నీ ఏరియాల్లోని నాళాలపై నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. 

కంటోన్మెంట్​ ఏరియాలో తొలిసారిగా అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గురువారం ( జూన్​5) కంటోన్మెంట్​ సీఈవో మధుకర్​ నాయక్​ తో కలిసి నాళా ఉన్న ఏరియాలను పరిశీలించారు. హైడ్రా కమిషనర్​రంగనాథ్​.  అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలతో నాళా కుచించుకుపోయినట్టు గుర్తించారు. కొద్దపాటి వర్షానికే ఈ ప్రాంత  ప్రజలు ముంపునకు గురవుతున్నారు. కంటోన్మెంట్ అధికారుల సహకారంతో ప్యాట్ని నాళా వెంట నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.