కోల్​బెల్ట్ లో ప్రజల కోసం పనిచేస్తం : వివేక్ ​వెంకటస్వామి

కోల్​బెల్ట్ లో ప్రజల కోసం పనిచేస్తం : వివేక్ ​వెంకటస్వామి
  • సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల క్యాలెండర్ల ఆవిష్కరణ

కోల్​బెల్ట్, వెలుగు: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి కోసం పనిచేస్తామని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి, గడ్డం వినోద్​అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం గోపాలవాడలోని షారోన్​గాస్పెల్​చర్చిలో మంచిర్యాల జిల్లా యునైటెడ్​పాస్టర్స్​ ఫెలోషిప్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు.

పాస్టర్లు, క్రైస్తవ సమాజానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ​సీనియర్​ లీడర్​ కేవీ ప్రతాప్, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, ఫాస్టర్స్​ అసోసియేషన్​ జిల్లా ప్రెసిడెంట్​రజనీకుమార్, సెక్రటరీ రత్న కుమార్, వైస్ ​ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు. 

గాంధారి మైసమ్మ తల్లికి పూజలు

మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారి మైసమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగిన  సప్తశత చంఢీ యాగంలో వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట బొక్కలగుట్ట సర్పంచి బొలిశెట్టి సువర్ణ, మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్​ లీడర్లు ఉన్నారు.

అనంతరం మందమర్రి సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్​లో చేపట్టిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్​ పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, అసోసియేషన్​ బాధ్యులతో కలిసి న్యూ ఇయర్​ క్యాలెండర్లను ఆవిష్కరించారు. మందమర్రి మున్సిపాలిటీ 14వవార్డులో ప్రజాపాలనలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.