ఆగి ఉన్న డీసీఎంలో చెలరేగిన మంటలు..కారు, మినీ బస్సు దగ్ధం

 ఆగి ఉన్న డీసీఎంలో చెలరేగిన మంటలు..కారు, మినీ బస్సు దగ్ధం

సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు బీరంగూడలో ఆగి ఉన్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో డీసీఎం, కారు, ఓ మినీబస్సులు పక్కనే  పార్క్ చేయడంతో వాటికి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో డీసీఎంతో సహ  కారు, మినీబస్సు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కరెంట్‌ ఆయిల్‌ తీసుకెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.