రైల్వే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఏజ్ లిమిట్ పెంపు

రైల్వే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఏజ్ లిమిట్ పెంపు

RRB జాబ్స్ సాధించాలనుకనే అభ్యర్థులకు రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రైల్వే శాఖలో పలు జోన్లలో 5,600 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు పక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థుల ఏజ్ లిమిట్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వయోపరిమితి 18ఏళ్లు ఉండగా దాన్ని 30 సంవత్సరాలకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పెంచింది. తాజాగా మల్లీ  ఈ పయోపరిమితిని 33 ఏళ్లకు పొడిగించింది. ఈ నిబంధన ప్రకారం  జూలై 1, 2024 నాటికి 18 నుంచి 33ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన వారికి వయో సడలింపు కూడా వర్తిస్తుంది. దరఖాస్తు గడువు ఫిబ్రవరి 19 వరుకు ఉంది. జూన్ – ఆగస్ట్ నెలల్లో CBT–1,  సెప్టెంబర్ లో CBT–2, నవంబర్ నెలలో CBAT టెస్ట్ నిర్వహించనున్నారు.