సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంపు

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈనెల 26 తేదీన జరిగే  బోర్డు మీటింగ్ లో అమలు తేదీని ప్రకటించాలని  సింగరేణి ఎండీ శ్రీధర్ ను ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని  కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయస్సుపెంపు నిర్ణయం తీసుకున్నారు సీఎం.  ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనుంది. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశం పై  ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో మంగళవారం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.

 రామగుండం నియోజక వర్గ కేంద్రం లో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నారు.