స్పెషల్ ఫ్లైట్‌లో ఐర్లాండ్‌కు భారత క్రికెటర్లు

స్పెషల్ ఫ్లైట్‌లో ఐర్లాండ్‌కు భారత క్రికెటర్లు

వెస్టిండీస్ పర్యటన ముగిసి రెండ్రోజులు గడిచిందో లేదో భారత క్రికెటర్లు మరో సిరీస్‌కు పయనమయ్యారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌‌లో ఐర్లాండ్‌కు బయలుదేరారు. మరికొన్ని గంటల్లో ఈ విమానం డబ్లిన్‌లో ల్యాండ్ కానుంది.  

ఐర్లాండ్‌ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సిరీస్‌కు సెలక్టర్లు.. భారత ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేశారు. రింకూ సింగ్‌, యశస్వీ జైశ్వాల్‌, తిలక్‌ వర్మ, జితేష్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు.  ఆగస్టు 18 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది. మ్యాచ్‌లన్నీ డబ్లిన్ వేదికగా జరగనున్నాయి.

ALSO READ :RCB ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై 

జస్ప్రీత్‌ బుమ్రా సారథ్యంలోని భారత యువ జట్టు మంగళవారం ఐర్లాండ్‌కు పయనమైంది. అందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. బుమ్రాతో పాటు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, ప్రసిద్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్‌, శివమ్‌ దుబే వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరింతా స్పెషల్ ఫ్లైట్‌లో లగ్జరీగా సేదతీరుతూ కనిపించారు. వీటిని చూసిన నెటిజెన్స్ అదృష్టమంటే మీదే బాసూ అంటూ పొగుడుతున్నారు.

ఇండియా vs ఐర్లాండ్ షెడ్యూల్

  • తొలి టీ20: 18 ఆగస్ట్ (ది విలేజ్, డబ్లిన్)
  • రెండో టీ20: 20 ఆగస్ట్ (ది విలేజ్, డబ్లిన్)
  • మూడో టీ20: 23 ఆగస్ట్ (ది విలేజ్, డబ్లిన్)

భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ 

ఐర్లాండ్ టీ20 జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బరిన్, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.