గ్రేటర్ వ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సంబురంగా కొనసాగుతున్నాయి. బుధవారం జూబ్లీహిల్స్ లోని రోడ్ నం.36 లోని ఫ్రీడమ్ పార్కులో మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ మొక్కలను నాటారు. బీజేవైఎం ఆధ్వర్యంలో దిల్ సుఖ్ నగర్ నుంచి వనస్థలిపురంలోని పనామా చౌరస్తా వరకు స్కూల్ స్టూడెంట్లతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. గోల్కొండ కోటలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో దేశ భక్తి గీతాలతో నిర్వహించిన బ్యాండ్ సింఫోనీ ప్రోగ్రామ్ ఆకట్టుకుంది.
బంజారాహిల్స్ లోని ఎన్ బీటీ నగర్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు చెందిన 2 వేల మంది స్టూడెంట్లతో కలిసి మేయర్ విజయలక్ష్మి జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు. హిమాయ త్సాగర్లోని ప్లాంటేషన్ సెల్లో వాటర్ బోర్డు అధికారులు , నార్సింగి పీఎస్లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, బండ్లగూడ జాగీర్లోని ఫ్రీడమ్ పార్కులో సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ మొక్కలు నాటారు.
- వెలుగు,హైదరాబాద్/మెహిదీపట్నం/గండిపేట