గవర్నమెంట్ బడిలో టీచర్లు.. క్లాస్ రూంలో ఏం పనులివి.. మాస్టారు భార్య స్కెచ్కు దొరికారు !

గవర్నమెంట్ బడిలో టీచర్లు.. క్లాస్ రూంలో ఏం పనులివి.. మాస్టారు భార్య స్కెచ్కు దొరికారు !

కన్నౌజ్: ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్, మాస్టార్ రొమాన్స్ చేసుకున్నారు. ఈ దృశ్యాలు.. ఈ రొమాంటిక్ మాస్టర్ భార్య సీక్రెట్గా తరగతి గదిలో ఉంచిన కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేయడంతో ఈ ఘటన వైరల్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఉండి కామోద్రేకం మైకంలో మతి తప్పి ప్రవర్తించిన ఈ టీచర్లను.. దుష్ప్రవర్తన, వృత్తికి భంగం కలిగించారనే కారణాలతో సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ కాంపోజిట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సౌరిఖ్ బ్లాక్‌లోని బజేడి గ్రామంలోని ఒకే ప్రభుత్వ పాఠశాలలో ఒక సహాయ ఉపాధ్యాయుడు, ఒక మహిళా సహాయ ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు. ఈ ఘటన వాస్తవానికి జనవరిలోనే జరిగింది. అయితే.. బాధితుడి భార్య ఇటీవల ఈ వీడియోను అప్ లోడ్ చేసింది.

భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో.. మాస్టారు భార్య అతనిపై నిఘా పెట్టింది. స్కూల్లో తన భర్త ఒక టీచరమ్మతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో కన్ఫర్మ్ చేసుకోవడానికి క్లాస్ రూంలో సీక్రెట్ కెమెరాను అమర్చింది. స్కూల్లో బ్రేక్ సమయంలో ఆ ఇద్దరు టీచర్లు ముద్దు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకోవడంతో భార్య అనుమానం నిజమైంది.

►ALSO READ | అమెరికాలో దారుణం: నువ్వు ముస్లిమా..? అని అడిగి.. ఇండియన్ ని కత్తితో 15 సార్లు పొడిచి చంపాడు...

ఈ వీడియోలు బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ ఇద్దరు టీచర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 13న ఈ విషయంపై విద్యా శాఖ అధికారులు దర్యాప్తు చేశారు. ఇద్దరూ తప్పు చేసినట్లు తేలడంతో విద్యా శాఖ ఈ టీచరమ్మను, మాస్టారును సస్పెండ్ చేసింది.