దేశంలో మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి నుంచి నిన్నటివరకూ 20వేలకు దిగువనే నమోదైన కొవిడ్ కేసులు.. దాదాపు 145 రోజుల తర్వాత ఆ మార్క్ ను దాటాయి. గడిచిన 24గంటల్లో 3.94 లక్షల మంది కరోనా పరీక్షలు చేయగా.. 20,139 మందికి పాజిటివ్ గా నిర్థరించారు.  నిన్నటితో పోల్చుకుంటే 3,619 కేసులు  పెరిగాయి. దీంతో పాజిటివిటీ రేటు5.1శాతంగా నమోదు కాగా, ఇప్పటి వరకూ 4.36 కోట్ల మంది కొవిడ్ మహమ్మారి బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా క్రియాశీల కేసులు 1.36లక్షలకు చేరుకోగా.. రికవరీ రేటు 98.5 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో 16,482మంది కోలుకోగా.. 38 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5.25 లక్షలు దాటింది.