న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించిన లిస్ట్లను మన దేశం, పాకిస్తాన్ బుధవారం ఇచ్చిపుచ్చుకున్నాయి. న్యూక్లియర్ స్థావరాలపై ఒక దేశం మరొక దేశం దాడి చేసుకోకుండా డిసెంబర్ 31, 1988లో రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. జనవరి 1, 1992 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. రెండు దేశాలు దీనిని1992 నుంచి కొనసాగిస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ లో భాగంగాతమ దేశంలోని న్యూక్లియర్ స్థావరాల లిస్ట్ను ఇస్లామాబాద్లోని మన హైకమిషన్ ప్రతినిధికి అందజేసినట్టు పాకిస్తాన్ బుధవారం తెలిపింది. మనదేశంలో ఉన్న న్యూక్లియర్ స్థావరాల లిస్ట్ను కూడా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు అందజేసినట్టు ఫారెన్ మినిస్ట్రీ ప్రతినిధి చెప్పారు. రెండు దేశాలు ఒకే రోజు తమ దగ్గరున్న న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ సమాచారాన్ని పంచుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు
దెబ్బతిన్నాయి.