దేశవ్యాప్తంగా కొత్తగా 18,257 కరోనా కేసులు

 దేశవ్యాప్తంగా కొత్తగా 18,257 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,257 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,29,68,533కి చేరుకుంది.  మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 5,25,428 కు పెరిగింది. అటు గడిచిన 24 గంటల్లో 14,553 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో  1,28,690 యాక్టివ్ కేసుులున్నాయి. దేశంలో  అత్యధికంగా  కేరళలో 3,186 , పశ్చిమ బెంగాల్‌లో 2,968,  మహారాష్ట్రలో 2,760, తమిళనాడులో 2,671 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.22 శాతంగా, రికవరీ రేటు 98.51 శాతంగా,  ఉందని  కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.