దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,815 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 4,34,69,234కి చేరుకుంది. కరోనాతో పోరాడుతూ మరో 38 మంది ప్రాణాలు కొల్పోయారు. దీనితో మరణాల సంఖ్య 5,25,343కు పెరిగింది. 15,899 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,22,335 యాక్టివ్ కేసులుండగా, పాజిటివిటీ రెటు 4.96%, రికవరీ రేటు 98.51 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉంది. కేరళలో 3,310 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 2,889 కేసులు, మహారాష్ట్రలో 2,678 కేసులు అత్యధికంగా నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#COVID19 | India reports 18,815 fresh cases, 15,899 recoveries, and 38 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 8, 2022
Active cases 1,22,335
Daily positivity rate 4.96% pic.twitter.com/1kAaTtgBp6