మళ్లీ పెరిగిన కేసులు

మళ్లీ పెరిగిన కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో  దేశవ్యాప్తంగా 18,930 కొత్త కేసులు వెలుగు చూశాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,66,739 కు చేరుకుంది. అటు మరో 35 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. దీనితో మరణాల సంఖ్య 5,25,305 కు పెరిగింది. మరోవైపు 4,650 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.  ప్రస్తుతం 1,19,457 యాక్టీవ్ కేసులున్నాయి. ఈ మేరకు  కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి చేరుకుంది. రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి.   మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటకతో సహా పలు రాష్ట్రలలో కేసులు పెరుగుతున్నాయి.