టీమిండియాతో సిరీస్ ప్రకటించిన శ్రీలంక క్రికెట్...ఎప్పుడంటే..?

టీమిండియాతో సిరీస్ ప్రకటించిన శ్రీలంక క్రికెట్...ఎప్పుడంటే..?

శ్రీలంక క్రికెట్ కు మళ్ళీ పాత రోజులు వచ్చాయి. ఆ జట్టు వరుస పెట్టి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో ప్రభుత్వ జోక్యం కారణంగా ఐసీసీ శ్రీలంక క్రికెట్ ను అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడకుండా నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించి లంక క్రికెట్ బోర్డు లో సంతోషాన్ని నింపింది. దీని ప్రకారం శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ కు ఆడుకోవచ్చు. దీంతో భారత్ తో సిరీస్ సెట్ చేసుకుంది. 

2024 T20 ప్రపంచ కప్ తర్వాత జూలై నెలలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలతో పాటు, 3 టీ20 మ్యాచ్ ల షెడ్యూల్ ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ నేడు (నవంబర్ 29) ప్రకటించింది. 2024 లో శ్రీలంక క్రికెట్ షెడ్యూల్ మొత్తాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శ్రీలంక మొత్తం 10 టెస్టులు, 21 వన్డేలతో పాటు 21 టీ20 మ్యాచ్ లతో మొత్తం 51 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడనుంది. 
 
శ్రీలంక 2024 అంతర్జాతీయ క్రికెట్ ను జనవరిలో జింబాబ్వేతో సిరీస్‌ ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా మూడు వన్డేలతో పాటు మూడు టీ 20 మ్యాచ్ లు ఆడుతుంది. ఇక ఫిబ్రవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు T20 మ్యాచ్ లు ఆడుతుంది. మరో వైపు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతుండగా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటించాల్సి ఉంది. జనవరి లో ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్, ఫిబ్రవరి లో ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్, ఐపీఎల్, టీ 20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకలో పర్యటిస్తుంది.

Also Read :- పట్టు వదలని బీసీసీఐ... టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

 Sri Lanka Men’s 2024 Future Tours Program Announced! ?

The Sri Lanka National Team will commence its 2024 international cricket calendar with a home series against Zimbabwe in January, which will consist of three ODIs and three T20i series.

It would be followed by a series… pic.twitter.com/6BRRUCNhCs