సెంచరీతో చెలరేగిన మయాంక్..హాఫ్ సెంచరీ చేసిన రహానే

సెంచరీతో చెలరేగిన మయాంక్..హాఫ్ సెంచరీ చేసిన రహానే

హోల్కర్ స్టేడియంలో బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ , రహానే అదరగొడుతున్నారు. నిలకడగా బంగ్లా బౌలర్లను ఎదుర్కొంటూ  సెంచరీ బాదాడు. 183 బంతుల్లో 15 ఫోర్లు ఒక సిక్సుతో 101 పరుగులు చేశాడు. టెస్టుల్లో మూడో సెంచరీ చేశాడు. మయాంక్ తోడుగా రహానే కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 66 ముగిసే సరికి  3  వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. మయాంక్ 111 , రహానే 50  పరుగులతో ఉన్నారు. ప్రస్తుతానికి ఇండియా 63 పరుగుల అధిక్యంలో ఉంది.