న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్... ఆ జట్టుతో తొలి టీ20 మ్యాచ్లో మాత్రం కంగుతింది. సిరీస్ రేసులో నిలవాలంటే రెండో టీ20 టీమిండియాకు కీలకం కానుంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా ఆదివారం ఏకానా స్టేడియంలో జరగనుంది. మొదటి టీ20 మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో హార్దిక్ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. రెండో టీ20లో ఆల్ రౌండర్ ప్రదర్శరనను కనబరుచాలని అభిమానులు అశిస్తున్నారు.
అటు మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. దీంతో రెండో టీ20 మ్యాచ్ ఇరు జట్ల మధ్య రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనున్న లఖ్నవూ స్టేడియం బ్యాటింగ్, బౌలింగ్కు సమానంగా సహకరిస్తుందని అంచనా. ఇప్పటివరకు ఈ వేదికపై 8 మ్యాచ్లు జరగగా ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించగా, మూడు సార్లు ముందుగా బౌలింగ్ చేసిన జట్టును విజయం వరించింది.