IND vs SA: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

IND vs SA: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగుల వద్ద శిఖర్ ధావన్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కోహ్లీ కేశవ్ మహారాజ్ చేతిలో డకౌట్ అయ్యాడు.  అంతకు ముందు టాస్ గెలిచి  బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మంచి ఓపెనింగ్ దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ధావన్  పాట్నర్ షిప్ లో 63పరుగులు  చేశారు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి  83 పరుగులు చేసింది.  కేఎల్ రాహుల్ 32,రిషబ్ పంత్ 11 క్రీజులో ఉన్నారు. మొదటి వన్డేలో భారత్ ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్ లో ఒక మ్యాచ్ నెగ్గి ముందంజలో ఉన్నారు సఫారీలు.