సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం..సిరీస్ క్లీన్ స్వీప్

సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం..సిరీస్ క్లీన్ స్వీప్

టెస్టు క్రికెట్ లో భారత్ చరిత్ర సృష్టించింది. సఫారీలపై మూడు టెస్టుల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫాలో ఆన్ లో భాగంగా 8 వికెట్ల నష్టానికి 132 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సఫారీలు..మరో 2 రన్స్ మాత్రమే జోడించి ఆలౌటైయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 202  పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లతో రాణించగా..కొత్త బౌలర్ షబాజ్ నదీమ్ 2 వికెట్లతో రాణించారు.