కేప్టౌన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (201 బాల్స్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 79) ఫామ్లోకి వచ్చాడు. చాన్నాళ్ల తర్వాత పక్కా టెస్టు ఇన్నింగ్స్తో ఇంప్రెస్ చేశాడు. ఎంతో ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. కోహ్లీ క్లాస్ బ్యాటింగ్తో సత్తా చాటినా మిగతా ప్లేయర్లు ఫెయిలవడంతో మంగళవారం మొదలైన మూడో టెస్టులో ఫస్ట్డే సౌతాఫ్రికాదే అయింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 77.3 ఓవర్లలో 223 రన్స్కే ఆలౌటైంది. బౌలింగ్కు సపోర్ట్ ఇస్తున్న పిచ్పై కోహ్లీకి తోడు చతేశ్వర్ పుజారా (43), రిషబ్ పంత్ (27) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో రబాడ (4/73), జాన్సెన్ (3/55) ఇండియాను దెబ్బకొట్టారు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సౌతాఫ్రికా డే చివరకు 8 ఓవర్లలో 17/1తో నిలిచింది. హోమ్టీమ్ బ్యాటింగ్కు పెద్ద దిక్కు కెప్టెన్ డీన్ ఎల్గర్ (3)ను బుమ్రా (1/0) ఐదో ఓవర్లోనే ఔట్ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం మరో ఓపెనర్ మార్క్రమ్ (8 బ్యాటింగ్), నైట్ వాచ్మన్గా వచ్చిన కేశవ్ మహారాజ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా స్కోరుకు హోమ్టీమ్ ఇంకా 206 రన్స్ దూరంలో ఉంది. బుధవారం మన బౌలర్లు సఫారీలను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేస్తేనే మ్యాచ్తో పాటు సిరీస్ విక్టరీపై ఆశలు పెట్టుకోవచ్చు.
కెప్టెన్ నిలిచిండు..
ఇండియా ఇన్నింగ్స్లో కోహ్లీనే హీరో. సీనియర్ పుజారా, పంత్ కూడా తలో చేయి వేశారు. సిరీస్ విన్నర్ను తేల్చే ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన ఇండియాకు మంచి స్టార్టింగ్ దొరకలేదు. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (12), మయాంక్ అగర్వాల్ (15) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. కెరీర్లో 50వ టెస్టు ఆడుతున్న రబాడ ఆఫ్ స్టంప్ను టార్గెట్ చేసి బాల్స్ వేయగా.. ఒలివర్ బౌన్స్తో వీళ్లను ఇబ్బంది పెట్టాడు. మంచి ఫామ్లో ఉన్న లోకేశ్ తొలుత చాలా బాల్స్ను వదిలేసినా.. ఒలివర్ (1/42) ఆఫ్స్టంప్పై వేసిన రైజింగ్ బాల్ను అనవసరంగా ఆడి కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. రబాడ వేసిన థర్డ్ ఓవర్లో సున్నా వద్దే క్యాచ్డ్రాప్ అవడంతో బతికిపోయిన మయాంక్ అతనికే వికెట్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడటంతో 33/2తో ఇండియా డీలా పడ్డది. ఈ టైమ్లో పుజారాకు కోహ్లీ తోడయ్యాడు. తన స్టయిల్కు భిన్నంగా విరాట్ చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో ఆఫ్ స్టంప్ బాల్స్కు ఔటైన తను ఈసారి పూర్తిగా డిఫరెంట్గా ఆడాడు. ఆఫ్ స్టంప్ బాల్స్ను అస్సలు ముట్టుకోలేదు. ఖాతా తెరిచేందుకు15 బాల్స్ తీసుకున్నాడు. 16వ బాల్కు ఓ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్తో ఫోర్ కొట్టాడు. మరో ఎండ్లో పుజారా కూడా నిలకడ చూపడంతో 75/2తో ఇండియా లంచ్కు వెళ్లింది. బ్రేక్ నుంచి వెంటనే పుజారా కవర్స్ మీదుగా బౌండ్రీ తెచ్చాడు. కోహ్లీతో పోలిస్తే కాస్త స్పీడ్గా ఆడిన తను జాన్సెన్ బౌలింగ్లో ఫోర్ కొట్టి ఫిఫ్టీకి దగ్గరయ్యాడు. కానీ, అదే ఓవర్లో జాన్సెన్ అద్భుత బాల్తో పుజాను కాట్ బిహైండ్ చేయడంతో థర్డ్ వికెట్కు 62 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ టైమ్లో రహానె (9) రెండు ఫోర్లు, కోహ్లీ 6, 4 కొట్టి స్పీడ్ పెంచారు. కానీ, రబాడ గుడ్లెంగ్త్ బాల్కు రహానె కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దీనికి రివ్యూ కూడా వేస్ట్ చేశాడు. ఈ దశలో కీపర్ రిషబ్ పంత్, కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చాన్స్ వచ్చినప్పుడల్లా బౌండ్రీలు కొడుతూ స్కోరుకు వేగం తెచ్చారు. ఒలివర్ బౌలింగ్లో ఫోర్తో కోహ్లీ ఫిఫ్టీ (158 బాల్స్లో) కంప్లీట్ చేసుకున్నాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే ఎక్స్ట్రా బౌన్స్ బాల్తో పంత్ను ఔట్ చేసిన జాన్సెన్ ఐదో వికెట్కు 51 పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. స్పిన్నర్ అశ్విన్ (2) కూడా జాన్సెన్కు వికెట్ ఇవ్వడంతో 175/6తో నిలిచిన ఇండియా 200 కూడా చేస్తుందో లేదో అనిపించింది. ఈ టైమ్లో కోహ్లీ గేర్లు మార్చి వెంటవెంటనే మూడు ఫోర్లు బాదగా, శార్దూల్ (12) ఓ ఫోర్, సిక్స్ కొట్టడంతో స్కోరు 200 దాటింది. మరో షాట్కు ట్రై చేసిన శార్దూల్... పీటర్సన్కు క్యాచ్ ఇచ్చాడు. రబాడ వరుస ఓవర్లలో బుమ్రా, కోహ్లీని వెనక్కుపంపగా.. ఎంగిడి (1/33) బౌలింగ్లో షమీ (7) బవూమకు క్యాచ్ ఇవ్వడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
స్కోర్స్
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 77.3 ఓవర్లలో 223 ఆలౌట్ (కోహ్లీ 79, పుజారా 43, రబాడ 4/73, జాన్సెన్ 3/55). సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 8 ఓవర్లలో 17/1 (మార్క్రమ్ 8 బ్యాటింగ్, కేశవ్ 6 బ్యాటింగ్, బుమ్రా 1/0).