వరల్డ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ రెండో మ్యాచ్‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ గెలుపు

వరల్డ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ రెండో మ్యాచ్‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ గెలుపు

బుసాన్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ బోణీ చేసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌‌‌‌లో 3–2తో హంగేరీపై గెలిచింది. రెండు సింగిల్స్‌‌‌‌ ఆడిన మనిక బాత్రా 8–11, , 11–5, 12–10, 8–11, 11–4తో డోరా మదరాస్‌‌‌‌పై, 11–5, 14–12, 13–11తో పోటా జార్జినాపై గెలిచింది. 

కానీ తెలుగమ్మాయి ఆకుల శ్రీజ రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనూ ఓడింది. దీంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమం కాగా ఐదో సింగిల్స్‌‌‌‌లో ఐహిక ముఖర్జీ 7–11, 11–6, 11–7, 11–8తో బాలింట్‌‌‌‌ బెర్నాడెట్‌‌‌‌ను ఓడించి ఇండియాను గెలిపించింది. మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ 1–3తో పోలెండ్‌‌‌‌ చేతిలో ఓడింది.