
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ను చేజార్చుకున్న ఇండియా.. టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ఆడుతోంది. రెండు టెస్ట్ల్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్మొదలైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓవైపు సీనియర్లకు గాయాలు.. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు క్వాలిఫికేషన్ నేపథ్యంలో టీమిండియాకు ఈ సిరీస్ కీలకంకానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఇండియా నాలుగో ప్లేస్లో ఉంది. జూన్లో జరిగే ఫైనల్స్కు అర్హత సాధించాలంటే ఈ రెండు టెస్ట్లు నెగ్గడంతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్ల్లోనూ గెలవాల్సి ఉంటుంది.
టీమిండియా: శుభ్ర్మన్ గిల్, రాహుల్ (కెప్టెన్), పుజారా, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, సిరాజ్