దంపతుల వద్ద 45 పిస్టల్స్‌... ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌

దంపతుల వద్ద 45 పిస్టల్స్‌... ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 పిస్టల్స్‌ తో వెళ్తున్న ఇద్దరు భారతీయులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.  అరెస్టయిన ఇద్దరు హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ భార్యభర్తలు కాగా వీరితో పాటుగా 17 నెలల కుమార్తె కూడా ఉంది.. ఈ జంట జులై 10న వియత్నాం నుండి ఇండియాకు తిరిగి వచ్చారు. జగ్జీత్‌ వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్‌ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గన్స్‌పై ఆరా తీశారు. అయితే ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నుంచి విమానంలో వియత్నం వచ్చిన తన సోదరుడు మంజిత్‌ సింగ్‌ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్జీత్‌ సింగ్‌ తెలిపాడు. నిందితులిద్దరూ గతంలో టర్కీ నుంచి ఇండియాకు 25 పిస్టల్స్‌ ను తీసుకొచ్చినట్లు విచారణలో  అంగీకరించారు. 45 పిస్టల్స్‌ విలువ సుమారుగా రూ.  22 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.  దంపతులను కస్టమ్స్ ఎసి సెక్షన్ 104 కింద అరెస్టు చేయగా, బిడ్డను వారి అమ్మమ్మకు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.