ఇండియా టాప్‌‌ షో..పాకిస్తాన్​​పై ఘన విజయం

ఇండియా టాప్‌‌ షో..పాకిస్తాన్​​పై ఘన విజయం

చెన్నై : ఆసియా చాంపియన్స్‌‌ ట్రోఫీలో ఇండియా హాకీ టీమ్‌‌ జైత్రయాత్ర కొనసాగించింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లోనూ ఇండియా 4–0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌పై ఘన విజయం సాధించింది. టీమిండియా తరఫున హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (15, 23వ ని.), జుగ్​రాజ్‌‌ సింగ్‌‌ (36వ ని.), అకాశ్‌‌దీప్‌‌ సింగ్‌‌ (55వ ని.) గోల్స్‌‌తో హడలెత్తించారు. పాక్‌‌ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓవరాల్‌‌గా రౌండ్​ రాబిన్​లో ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లో ఇండియా 4 విజయాలు, ఓ డ్రాతో 13 పాయింట్లు నెగ్గి టాప్‌‌ ప్లేస్‌‌తో సెమీస్​కు రెడీ అయింది. 

మరో మ్యాచ్‌‌లో మలేసియా 1–0తో కొరియాపై నెగ్గింది. మలేసియా తరఫున అజ్రాయ్‌‌ అబు కమల్‌‌ (22వ ని.) గోల్‌‌ చేశాడు. చైనాతో జరిగిన మ్యాచ్‌‌లో జపాన్‌‌ 2–1తో గెలిచింది. కాగా, శుక్రవారం జరిగే సెమీఫైనల్లో జపాన్​తో ఇండియా పోటీ పడనుంది. మరో మ్యాచ్​లో మలేసియా–కొరియా తలపడతాయి.