ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు ద్రౌపది ముర్ము

ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు ద్రౌపది ముర్ము

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు భారత్ తరఫున ఆమె వెళ్లారు. సెప్టెంబర్ 8న స్కాట్లాండ్ లోని బల్మోరల్ కాసిల్ లో క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. రేపు వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం బకింగ్ హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్-3 ఆధ్వర్యంలో ప్రపంచాధి నేతల మధ్య ఈ  కార్యక్రమం జరగనుంది. 

ఈ నెల 12 న భారత్ లోని బ్రిటిష్ హై కమిషనర్ ను కలిసి ఎలిజబెత్ 2 మరణానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ నెల 11 న దేశంలో జాతీయ సంతాప దినాన్ని  కేంద్రం ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ద్రౌపది ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన. 

క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల అధినేతలు లండన్ చేరుకుంటున్నారు. రేపు జరిగే అంత్యక్రియల కోసం లండన్ విండ్సర్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలకు చెందిన వందలాది మంది సైనికులు ఇందులో పాల్గొంటున్నారు. క్వీన్ శవపేటికను.. అంతిమ సంస్కారాలు నిర్వహంచే చోటుకు తీసుకువెళ్లేందుకు సంబంధించిన డ్రమ్స్, బ్యాండ్ సౌండ్స్ లతో రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ పరేడ్ అత్యంత ముఖ్యమైందని అధికారులు తెలిపారు.