చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న ఇండియన్లను రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించింది. భారత్ కు రాగానే వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 15 రోజుల పాటు వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి అనేక రకాల టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం టెస్టులు పూర్తి కావడంతో వారిని విడుదల చేసి..వారి వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టారు. వీరికి కరోనా వైరస్ లేదని తెలిపే సర్టిఫికెట్లు అందజేశారు డాక్టర్లు. తొలిసారి 324 మంది, తర్వాత 323 మంది.. మొత్తం 647 మంది భారత్ చేరుకోగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 23 మంది ఉన్నారు. వీరందరినీ అప్పటి నుంచి ఢిల్లీలోని ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి అవసరమైన పరీక్షలు నిర్వహించారు. దాదాపు పదిహేను రోజులపాటు పరిశీలన తర్వాత కేంద్ర ఆరోగ్య సంస్థ వీరికి కరోనా వైరస్ లేదని సర్టిఫికెట్ ఇచ్చి పంపుతోంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల వారు వారి స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది.
స్వస్థలాలకు వూహాన్ భారతీయులు
- దేశం
- February 18, 2020
లేటెస్ట్
- హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
- ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి : రాహుల్ రాజ్
- కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి
- బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు
- మోదీ పర్యటనను సక్సెస్ చేయాలి : కిషన్ రెడ్డి
- వడదెబ్బతో ఎంఈవో మృతి
- రంజిత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు
- రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ
- మెట్రోలో 50 కోట్ల మంది జర్నీ
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్