స్వస్థలాలకు వూహాన్ భారతీయులు

స్వస్థలాలకు వూహాన్ భారతీయులు

చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న ఇండియన్లను రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించింది. భారత్ కు రాగానే వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 15 రోజుల పాటు వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి అనేక రకాల టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం టెస్టులు పూర్తి కావడంతో వారిని విడుదల చేసి..వారి వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపట్టారు. వీరికి కరోనా వైరస్ లేదని తెలిపే సర్టిఫికెట్లు అందజేశారు డాక్టర్లు. తొలిసారి 324 మంది, తర్వాత 323 మంది.. మొత్తం 647 మంది భారత్ చేరుకోగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 23 మంది ఉన్నారు. వీరందరినీ అప్పటి నుంచి ఢిల్లీలోని ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచి అవసరమైన పరీక్షలు నిర్వహించారు. దాదాపు పదిహేను రోజులపాటు పరిశీలన తర్వాత కేంద్ర ఆరోగ్య సంస్థ వీరికి కరోనా వైరస్ లేదని సర్టిఫికెట్ ఇచ్చి పంపుతోంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల వారు వారి స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది.