కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి

కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి

మేడిపల్లి, వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మేడ్చల్​ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.  మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం పీర్జాదిగూడ, బోడుప్పల్​లో బీఆర్ఎస్​శ్రేణులు బైక్​ర్యాలీ నిర్వహించారు. లక్ష్మారెడ్డితోపాటు మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​హయాంలో కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్​ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. మోసపోయి కాంగ్రెస్ కు ఓటు వేశామని జనమే చెబుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోకి కరువు వచ్చిందని విమర్శించారు. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ, కాంగ్రెస్​నేతల మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో జనమే ముందుకొచ్చి బీఆర్ఎస్ ను గెలిపిస్తామంటున్నారని తెలిపారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు. ర్యాలీలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పీర్జాదిగూడ  బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారు రవీందర్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.