మోదీ పర్యటనను సక్సెస్​ చేయాలి : కిషన్ రెడ్డి

మోదీ పర్యటనను సక్సెస్​ చేయాలి : కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో మరోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సిటీ బీజేపీ ఆఫీసులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ నెల 5న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీజేపీ బూత్ అధ్యక్షులు, బూత్ కోఆర్డినేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు.

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. 10న ప్రధాని మోదీ హైదరాబాద్​రానున్నారని, ఆ పర్యటనను సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ప్రగతి కోసం కిషన్ రెడ్డి కేంద్రం నుంచి తీసుకువచ్చిన నిధులను ప్రజలకు వివరించాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లాఅధ్యక్షులు డా.ఎన్. గౌతమ్ రావు, బీజేపీ నేతలు అమర్ నాథ్, చంద్రశేఖర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. 

దేశం భద్రంగా ఉండాలంటే మళ్లీ మోదీ ప్రధాని కావాలి:తమిళిసై

సికింద్రాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్​రెడ్డి శుక్రవారం రాత్రి సికింద్రాబాద్​లో రోడ్​షో నిర్వహించారు. మాజీ గవర్నర్​తమిళిసై, సినీ నటుడు సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. కిషన్​రెడ్డిని మరోసారి గెలిపించి పార్లమెంట్​కు పంపాలన్నారు. దేశం భద్రంగా ఉండాలంటే మరోసారి మోదీని ప్రధానిని చేయాలని కోరారు. కాంగ్రెస్​కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదని ఎద్దేవా చేశారు.