బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. శనివారం సాయంత్రం పొద్దుపోయాక మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది హైదరాబాద్​ హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్​ అయిన సీనియర్​ కాంగ్రెస్​ లీడర్​ గాండ్ల సమ్మయ్యను, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న  ఆర్కే4 గడ్డ ప్రాంతానికి చెందిన కార్యకర్త రామగిరి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు. 

వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామకృష్ణాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఠాగూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐఎన్టీయూసీ సీనియర్​లీడర్ తేజావత్​రాంబాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎంపీ వెంట డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, టౌన్​ప్రెసిడెంట్​ వొడ్నాల శ్రీనివాస్, మాజీ ప్రెసిడెంట్​పల్లె రాజు, సీనియర్ లీడర్లు సదానందంయాదవ్,​ యాకుబ్​అలీ, కౌన్సిలర్లు, ​ లీడర్లు పాల్గొన్నారు.