నేడు కివీస్‌‌‌‌తో ఇండియా మూడో టీ20

నేడు కివీస్‌‌‌‌తో  ఇండియా మూడో టీ20

మ. 12 నుంచి డీడీ ​స్పోర్ట్స్​లో లైవ్‌‌

నెపియర్‌‌: న్యూజిలాండ్‌‌తో తొలి మ్యాచ్‌‌ రద్దయినా.. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ కురిపించిన పరుగుల వర్షంతో రెండో టీ20లో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌‌పై గురి పెట్టింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా మంగళవారం జరిగే గెలిచి 2–0తో సిరీస్‌‌ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు జట్టులో అవకాశం కోసం యంగ్‌‌స్టర్స్‌‌ సంజు శాంసన్‌‌, ఉమ్రాన్‌‌ మాలిక్‌‌ ఎదురు చూస్తున్నారు. 

చివరి పోరులో అయినా టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ వీరికి చాన్స్‌‌ ఇస్తుందా? లేదా గత మ్యాచ్‌‌ విన్నింగ్‌‌  కాంబినేషన్‌‌కు కట్టుబడుతుందా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు రెండో  మ్యాచ్‌‌లో తేలిపోయిన కివీస్‌‌ ఈ పోరులో గెలిచి సిరీస్‌‌ పంచుకోవాలని చూస్తోంది. కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ ముందుగా షెడ్యూల్‌‌ అయిన మెడికల్‌‌ అపాయింట్‌‌ కారణంగా ఈ మ్యాచ్‌‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్‌‌ సౌథీ టీమ్‌‌ను లీడ్‌‌ చేయనున్నాడు.