దేశంలో కేసులు 86 లక్షలు..రికవరీ 80 లక్షలు

దేశంలో కేసులు 86 లక్షలు..రికవరీ 80 లక్షలు

దేశంలో గత రెండు  కొన్ని రోజులుగా 50 వేలకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44281 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో  దేశంలో కరోనా కేసులు 86,36,012 కు చేరాయి. మరో 512 మంది చనిపోవడంతో మొత్తం కోవిడ్ మరణాలు 1,27,571 కు చేరాయి. నిన్న ఒక్కరోజే 50,326 మంది డిశ్చార్జ్ కావడంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 80,13,784 కు చేరాయి. ఇంకా 4 ,94,657మంది ఆస్పత్రిలో ఉన్నారు. దేశంలో కరోనా ఆక్టివ్ కేసులు 5.73 శాతం ఉండగా..రికవరీ 92.79 శాతం, డెత్ రేటు 1.48 శాతంగా ఉన్నాయి.