న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్యలో ఇండస్ట్రియల్అండ్ వేర్హౌసింగ్ స్పేస్ లీజింగ్ 9 శాతం పెరిగింది. ఇది దేశంలోని అయిదు సిటీలలో కలిపి 17.5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్లు కొలియర్స్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఆ నగరాలలో 16 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ రికార్డయింది. ఇండస్ట్రియల్ అండ్ వేర్హౌసింగ్ స్పేస్ లీజ్ బెంగళూరులో 2 శాతం పెరిగి 2.3 మిలియన్ చదరపు అడుగులకు చేరిందని పేర్కొంది. మరోవైపు చెన్నైలో మాత్రం ఇది 31 శాతం తగ్గి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైనట్లు తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇండస్ట్రియల్ అండ్ వేర్హౌసింగ్ స్పేస్ లీజింగ్ ఏకంగా 42 శాతం అధికమై 6.8 మిలియన్ చదరపు అడుగులయిందని కొలియర్స్ ఈ రిపోర్టులో వెల్లడించింది.
అంతకు ముందు ఏడాది సెప్టెంబర్ చివరిదాకా ఈ లీజింగ్ 4.8 మిలియన్ చదరపు అడుగులే. పుణెలో ఇండస్ట్రియల్ అండ్ వేర్హౌసింగ్ లీజింగ్ డిమాండ్ 11 శాతం తగ్గి 3.6 మిలియన్ చదరపు అడుగులకు చేరిందని రిపోర్టు తెలిపింది. వేర్హౌసింగ్ స్పేస్ను లీజుకు తీసుకుంటున్న వారిలో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్లేయర్లే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది. సగం డిమాండ్ వీరి నుంచే వస్తున్నట్లు వివరించింది. రిటెయిల్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగవడంతోపాటు, పండగ సీజన్తో ఆన్లైన్ సేల్స్ పెరగడమూ వేర్హౌసింగ్ డిమాండ్ పెరగడానికి కారణాలని రిపోర్టు విశ్లేషించింది. ఈ సెగ్మెంట్ మళ్లీ జోరందుకుంటోందని, లార్జ్ సైజ్ మెగా డిస్ట్రిబ్యూషన్సెంటర్ల కోసం చురుగ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయని కొలియర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ ఆర్ముగం చెప్పారు. లాంగ్ టర్మ్లో ఇది మరింత ఊపందుకోవడానికి కొత్తగా తెచ్చిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ సాయపడుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.