సికింద్రాబాద్, వెలుగు: క్లినిక్ను ఓపెన్ చేసి ట్రీట్ మెంట్ చేసే ఓ నకిలీ డాక్టర్ను డ్రగ్స్కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. అడ్డగుట్ట డివిజన్ పరిధి తుకారంగేట్ రియో పాయింట్ హోటల్ వద్ద వెంకటేశ్వర్ రెడ్డి (41) వాయు క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తూ ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్నాడు.
అనుమానం వచ్చిన కొందరు అతనిపై డ్రగ్స్కంట్రోల్అథారిటీ కంప్లయింట్ చేశారు. దీంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ స్పెక్టర్ గోవింద్ సింగ్, అనిల్ సిబ్బందితో శుక్రవారం వెళ్లి క్లినిక్ పై దాడి చేశారు. ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా రూల్స్ కు విరుద్ధంగా నిల్వ చేసిన యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, అల్సర్ డ్రగ్స్ తో పాటు 44 రకాల మెడిసిన్ తో పాటు రైల్వే కు సంబంధించిన మెడిసిన్ ను కూడా గుర్తించారు. సుమారు రూ 1,60 లక్షలు విలువైన మెడిసిన్ పట్టుకుని సీజ్ చేసి, ఫేక్ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.