3 టీవీలను లాంచ్​ చేసిన శామ్​సంగ్​

3 టీవీలను లాంచ్​ చేసిన శామ్​సంగ్​

శామ్​సంగ్​  నియో క్యూఎల్​ఈడీ 8కే, నియో క్యూఎల్​ఈడీ, 4కే  ఓఎల్​ఈడీ టీవీలను లాంచ్​ చేసింది.  గ్లేర్-ఫ్రీ ఓఎల్​ఈడీ టీవీలను కూడా ప్రారంభించింది. నియో క్యూఎల్​ఈడీ 8కే,  నియో క్యూఎల్​ఈడీ 4కే శ్రేణి ధరలు వరుసగా రూ.3,19,990,  రూ.1,39,990 నుంచి మొదలవుతాయి. అయితే ఓఎల్​ఈడీ టీవీల ధరలు రూ.1,64,990 నుంచి ప్రారంభమవుతాయి. 

ఏఐ పిక్చర్ టెక్నాలజీ, ఏఐ అప్‌‌‌‌స్కేలింగ్ ప్రో,  ఏఐ మోషన్ ఎన్‌‌‌‌హాన్సర్ ప్రో, క్లౌడ్​ గేమింగ్ సర్వీస్, శామ్‌‌‌‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్  వీటిలోని ప్రత్యేకతలు. శామ్‌‌‌‌సంగ్ భారతదేశంలో తన టెలివిజన్ వ్యాపారం ద్వారా ఈ ఏడాది  రూ.10 వేల కోట్ల టర్నోవర్‌‌‌‌ను టార్గెట్​గా పెట్టుకుంది.