వైఎస్సార్టీపీ చీఫ్షర్మిల మంగళవారం హనుమకొండలో హయగ్రీవచారి గ్రౌండ్ ఎదురుగా నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనునున్నారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభించనున్నారని ఆ పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.
చిన్నారి అత్యాచారంపై ఫిర్యాదు ..
సైదాబాద్ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని వైఎస్సార్టీపీ నేతలు మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. సింగరేణి కాలనీవాసులు చేపడుతున్న దీక్షకు సంఘీభావం తెలిపి ధర్నా నిర్వహించారు. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని పార్టీ అధికార ప్రతినిధి సత్యవతి కోరారు.