రెండ్రోజుల్లో టోకెన్ అమౌంట్ కట్టాలె

రెండ్రోజుల్లో టోకెన్ అమౌంట్ కట్టాలె

హైదరాబాద్, వెలుగు: లాటరీలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు దక్కించుకున్నోళ్లు రెండు రోజుల్లో టోకెన్ అమౌంట్ కట్టాలని అధికారులు సూచించారు. మంగళవా రంలోపు చెల్లించకపోతే ఫ్లాట్ క్యాన్సిల్ అవుతుందన్నారు. బండ్లగూడలో 2,237, పోచారంలో 1,458 ఫ్లాట్లకు పోయిన నెల లాటరీ తీసిన అధికారులు.. ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకు రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.లక్ష చొప్పున టోకెన్ అమౌంట్ ఖరారు చేశారు. ఫ్లాట్ దక్కించుకున్నోళ్ల వివరాలు హెచ్ఎండీ ఏ, స్వగృహ వెబ్ సైట్​లో ఉంచారు. www.swagruha.telangana.gov.in  వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడీ నమోదు చేసి అలాట్ మెంట్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.