అమ్మా చదవలేకపోతున్నా అంటూ.. పరీక్ష రాసి ప్రాణం తీసుకున్నాడు

అమ్మా చదవలేకపోతున్నా అంటూ.. పరీక్ష రాసి ప్రాణం తీసుకున్నాడు

చదువుపై ఉన్న ఒత్తిడిని భరించలేక విద్యార్థి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో జరిగింది. జీడిమెట్ల పరిధి షాపూర్ నగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు విద్యార్థి సుమిత్ కుమార్. విద్యార్థుడిని ఇంటర్మీడియట్ కోసం చింతల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపిసి గ్రూప్ లో తల్లిదండ్రులు చేర్పించారు. అయితే విద్యార్థికి చదువుపై ఇష్టం లేక ఆ గ్రూప్ వద్దని... చదవలేకపోతున్నట్లు తల్లిదండ్రులతో చెప్పాడు. దాంతో వారం క్రితం విద్యార్థుడిని మరో గ్రూప్ కు మార్చారు. అనంతరం కలశాలలో పరీక్షలు ఉండడంతో   సోమవారం మధ్యాహ్నం పరీక్ష రాసి నేరుగా నడుచుకుంటూ గాజులరామరం చింతల చెరువు వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా గాజులరామరం చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్లినట్లు రికార్డు అయింది. అనంతరం చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా విద్యార్థి చెప్పులు ఘటన స్థలంలో లభించినట్లు ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు. మృతదేహం కోసం NDRF బృందాలతో గాలింపు చేపట్టారు. చెరువులో సుమిత్ కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. కన్నబిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.