మళ్లీ సురేష్ రైనా రావాలంటున్న ఫ్యాన్స్
దుబాయ్: వరుస ఓటముల వల్ల ఐపీఎల్లో ఎప్పుడు లేనివిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. సురేశ్ రైనా లేకపోవడం జట్టు బ్యాలెన్స్ను దెబ్బతీస్తే.. అంబటి రాయుడు గాయపడడం మరింత నష్టం కలిగించింది. రాయుడు లేకపోవడం కచ్చితంగా లోటు అని ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనీ కూడా అన్నాడు. అయితే తమ తర్వాతి మ్యాచ్కు రాయుడు అందుబాటులో ఉంటాడని ధోనీ నమ్మకంగా ఉన్నాడు. ‘ కాంబినేషన్ పరంగా తర్వాతి మ్యాచ్కు మరింత క్లారిటీతో రావాల్సి ఉంది. రాయుడు తర్వాతి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నా. జట్టులో మరికొన్ని సమస్యలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎక్స్ట్రా బ్యాట్స్మన్తో ఆడుతున్నాం. అందువల్ల ప్లేయర్లంతా మరింత బాధ్యతగా ఆడి తీరాలి’ అని ధోనీ చెప్పాడు. రాజస్తాన్, ఢిల్లీ చేతిలో సీఎస్కే ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఫ్యాన్స్ సురేశ్ రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. రైనా అంశంపై సీఎస్ కే సీఈవో క్లారిటీ ఇచ్చేశారు. ఈ సీజన్లో అతన్ని మళ్లీ చూసే అవకాశం లేదని తేల్చేశారు.
మరో రెండు మ్యాచ్ లకు అశ్విన్ దూరం
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్ యాచ్లో గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లీగ్ లో మరో రెండు, మూడు మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కన్ఫామ్ చేశాడు.

