
మొహాలి: ముంబై, పంజాబ్ మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది పంజాబ్. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుణ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు అశ్విన్ చెప్పాడు. అలాగే గత మ్యాచ్ లో పోరాడి గెలిచిన టీమ్ నే కొనసాగిస్తున్నట్లు ముంబై కెప్టెన్ రోహిత్ తెలిపాడు.