హైదరాబాద్: థామస్, ఉబెర్ కప్ టోర్నమెంట్స్ విషయంలో ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సందేహం వెలిబుచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ టైమ్లో ఆ టోర్నీల్లో ఆడడం ఎంతవరకు సేఫ్ అంటూ ఆదివారం ట్విటర్ ద్వారా ప్రశ్నించింది. ‘కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటిదాకా ఏడు కంట్రీలు టోర్నీ నుంచి తప్పుకున్నాయి. ఇలాంటి తరుణంలో (థామస్, ఉబెర్ కప్ 2020) ఆ టోర్నమెంట్లు ఆడడం ఎంతవరకు సురక్షితం ?’ అంటూ సైనా ట్వీట్ చేసింది.
7 countries have withdrawn from tournament cause of the pandemic…Is it safe enough to conduct this tournament during this time ??… (Thomas and Uber Cup 2020) #coronavirus https://t.co/HC1qnueeLb
— Saina Nehwal (@NSaina) September 13, 2020